ఏపీలో కరోనా వైరస్.. 24 గంటల్లో 380 కేసులు

శనివారం, 20 మార్చి 2021 (19:02 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 30,978 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 380 కేసులు నిర్ధారణ అయ్యాయి. కోవిడ్‌ వల్ల గడిచిన 24 గంటల్లో కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,93,366కి చేరింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,189కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 204 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,094కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,47,05,188 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు