పరిహారం చెల్లించాలంటూ సీఆర్డీయేకు నోటీసులు పంపిన రైతు

సోమవారం, 21 మార్చి 2022 (08:13 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇపుడు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)తో పాటు ఏపీ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ)కి నోటీసులు పంపించారు. భూములు ఇచ్చిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాలంటూ వారు పేర్కొన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతానికి చెందిన రైతులు దాదాపు 30 వేలకు పైగా భూములు ఇచ్చారు. ఈ భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించేలా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, నిర్ణీత వ్యవధిలోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదంటూ పేర్కొంటూ సీఆర్డీఏ, రెరాలకు రైతులకు నోటీసులు పంపించారు. 
 
సీఆర్డీయే చేపట్టిన ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. జరిగిన ఆలస్యానికి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఎకరానికి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. నెలకు నివాస యోగ్య స్థలాలకు గజానికి రూ.50 చొప్పున, కవర్షియల్ ల్యాండ్‌కు రూ.75 చొప్పున చెల్లించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు