అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

ఠాగూర్

ఆదివారం, 8 జూన్ 2025 (22:31 IST)
అమరావతి వేశ్యల రాజధాని అంటూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఈ అంశంపై మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి త్వరలోనే సమన్లు పంపిస్తామని తెలిపింది. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ చాలా సీరియస్‌గా తీసుకుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి అరుణ తెలిపారు. 
 
రాజధాని మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిన కఠినంగా శిక్షించాలని కోరుతూ అమరావతి ఐక్య కార్యాచరణ సమితి తరపున మహిళా సంఘాల ఐక్యవేదిక, వివిధ పార్టీల నేతలు చైర్ పర్సన్‌‍ శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస రావు వ్యాఖ్యలు తమను బాధించాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు