నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఠాగూర్

ఆదివారం, 8 జూన్ 2025 (11:47 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి గతంలో ఓ టీవీ చర్చా కార్యక్రమం జరిగింది. ఇందలో పాత్రికేయుడు కృష్ణంరాజు 'వేశ్యల రాజధాని' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ శనివారం మరో వీడియోను విడుదల చేశారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 'జగనన్న కనెక్ట్స్' అనే సామాజిక మాధ్యమ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయకపోగా, అమరావతి పరిసర ప్రాంతాల్లోని మహిళా రైతులపై మరోసారి బురదజల్లే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
శుక్రవారం సాక్షి టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్లుగా కృష్ణంరాజు ఈ వీడియోలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తాను ప్రస్తావించానని తెలిపారు. 
 
"నేను దీన్ని ప్రస్తావిస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాను. అమరావతిలో అనలేదు" అని వీడియోలో పేర్కొన్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో అధికారులను అడిగితే వాస్తవాలు చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఈ వీడియోలో కృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డిపై జరుగుతున్న ట్రోల్స్‌ను ఖండించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన వైసీపీ పట్ల తన విధేయతను చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమరావతి ప్రాంత మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు