ఏపీలో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి

గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30సం) కరోనా వ్యాక్సిన్ వికటించడంతో మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న త‌రవాత నిన్న రాత్రంతా జ్వరం వాంతులు… విరేచనాలతో సుభాని మ‌ర‌ణించార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.
 
8 నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దాంతో 6 నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రి సుభానినే చూసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా మ‌ర‌ణించడంతో వ్యాక్సిన్ 6 నెలల పసికందు అనాథ‌గా మారిపోయాడు. సుభాని తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బంధువులు వ్యాక్సిన్ విక‌టించి మృతి చెందాడ‌ని చెప్పారు. కానీ వైద్యాధికారులు ఇంకా నిర్ధారించ‌లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు