వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన తిరుపతి పోలీసులు!

మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:41 IST)
ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీ అయిన వైకాపాతో పాటు వామపక్ష పార్టీలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది.
 
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు చెవిరెడ్డి సహకరించకపోవడంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
 
వామపక్ష నేతలను కూడా అరెస్ట్ చేశారు. జిల్లాలో పలుచోట్ల బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారు జామునే బస్‌డిపోలకు చేరుకుని విపక్ష నేతలు నిరసన కారక్యమాలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి