స్కూల్స్‌కు సమీపంలో గుట్కా - పాన్ షాపులు మూసివేత.. ఏపీ సర్కారు ఆదేశం

మంగళవారం, 29 జూన్ 2021 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు ఉన్న అన్ని పాన్, గుట్కా షాపులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు చెడు వ్యసనాల బారినపడకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
 
అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించే బాధ్యతను ఏఎన్ఎం‌లకు అప్పగించారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. 
 
ఏఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితిని ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. పాఠశాలల సమీపంలో పాన్ గుట్కా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇది పాఠశాల సమీపంలో సిగరెట్ తాగడాన్ని కూడా నిషేదించారు. మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో లేకుండా చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు