అర్థరాత్రి 12 గంటల వరకు దుకాణాలు... ఏపీ సర్కారు అనుమతి

మంగళవారం, 14 జూన్ 2022 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార దుకాణాలు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం ఇది వర్తించదు. ఇతర అన్ని రకాల దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకోవచ్చు.
 
కాగా, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ దుకాణాలన్నీ రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేలా ఆదేశించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటంతో ఈ నిబంధనను తొలగించి అర్థరాత్రి 12.30 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతి ఇచ్చింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు