మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (13:46 IST)
వైకాపా నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. ఆయన వద్ద ఉండే డిగ్రీ సర్టిఫికేట్ నకిలీదంటూ ప్రచారం సాగుతోంది. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టనున్నారు. 
 
శ్రీకాకుళం లోక్‌సభ స్థానం వైకాపా ఇన్‌చార్జ్ అయిన తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ధృవీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారన, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కూన రవికుమార్ వెల్లడించారు. 
 
తమ్మినేని తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్‌ వేసినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు బంద్! 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాలైన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ఆదేశాలు జారీచేసింది. ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని, ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు ఎన్.పి.సి.ఐ ఆదేశాలు జారీచేసింది. 
 
అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్లు కీలకం. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఎన్.పి.సి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రధానంగా దీర్ఘకాలంగా వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరు ఉపయోగిస్తుంటారు. దాంతో యూపీఏ ఖాతాలు కూడా వారి చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఉంది. దీనివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు వీలుగా ఎన్.పి.సి.ఐ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో పాటు బ్యాంకులు ఇన్‌యాక్టివ్‌‍ నంబర్లను తొలగించనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు