ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ - 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆదివారం, 19 జూన్ 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్టియర్ ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులోభాగంగా, ఈ నెల 20 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 27 నుంచి జూలై 20వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టి, జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో తొలి యేడాది ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. కాగా, ఈ నెల మొదటి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 6.15 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు