ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం... సంక్షేమం అపుడే!

సోమవారం, 27 డిశెంబరు 2021 (15:43 IST)
ఆరునూరైనా టీడీపీ అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సమర్థ నాయకుడు వస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని చెప్పారు.
 
 
విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగు విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దన్నారు... ఇంతవరకు లేదు. పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని చెప్పడం ఇదేమి చోద్యం అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. కార్మిక సంక్షేమం జరగాలంటే మళ్లీ తెదేపా రావాల‌ని, మ‌ళ్లీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు వ‌స్తేనే సంక్షేమం అని అచ్చెన్న అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు