ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బి.ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షా పేపర్ లీక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటలకు జరగాల్సిన "ప్రోస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్" పరీక్ష ప్రశ్నాపత్రం పరీక్షకు 30 నిమిషాల ముందు లీక్ కావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.