తిరుమలలో అద్భుతం... శివనామాలుగా మేఘాలు

సోమవారం, 22 నవంబరు 2021 (18:31 IST)
moon
తిరుమలలో అద్భుతం  జరిగింది. తిరుమల వెంకన్న ఆలయంలో చోటుచేసుకున్న ఈ అద్భుతంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఆకాశంలో శివనామాల మధ్య చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఏర్పడిన తెల్లని మేఘాలు విభూతితో తీర్చిదిద్దిన శివనామాలుగా భక్తులకు దర్శనమిచ్చాయి. 
 
ఈ విభూతితో తీర్చిదిద్దిన శివనామాల మధ్య చంద్రుడు తెల్లని బొట్టులా దర్శనమిచ్చాడు. తిరుమల  ఆలయ రక్షకుడు శివుడని మన పురాణాలు చెప్తున్న నేపథ్యంలో శివనామాల్లా మేఘాలు.. నామాల మధ్య తెల్లని బొట్టులా చంద్రుడు దర్శనమివ్వడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు