కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి (Video)

ఠాగూర్

సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:35 IST)
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగివుంటే బాధ్యులు రక్తం కక్కుకుని చనిపోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగివుంటే ఈ మహా పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి. శ్రీవారిని అదే కోరుకుంటున్నా అన్నారు. 
 
రాష్ట్రంలో వైకాపా, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా శాశ్వతంగా కనుమరుగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని, ఇందుకోసం సాక్షాత్తూ ఆ శ్రీవారిని పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

మేము తప్పు చేస్తే రక్తం కక్కుకుని చచ్చిపోవాలని వేంకటేశ్వరస్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను@ncbn నీ ఆరోపణలు నిరూపించడానికి సీబీఐ ఎంక్వైరీ గాని సుప్రీం కోర్టు జడ్జి ద్వారా గాని విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నాను.

-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్… pic.twitter.com/DEjdKJGv0y

— YSR Congress Party (@YSRCParty) September 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు