అందరూ దొంగలు కాదు కానీ... వైకాపాతో అంటకాగిన వారే.. బొలిశెట్టి సత్యనారాయణ

ఠాగూర్

బుధవారం, 18 సెప్టెంబరు 2024 (18:43 IST)
జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు ఘాటుగా స్పందించగా, వీటిని బొలిశెట్టి సత్యనారాయణ తిప్పికొట్టారు. 
 
"రెండు నెలల క్రితం రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్క రాజధాని కడదామనుకున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికృత ఆలోచనను టీవీ డిబేట్‌లో బహిరంగంగా పరిచారు. అటు వైసీపీ నాయకులుగాని, వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకులుగాని ముఖ్యంగా వైకాపా కండువా కప్పుకొని వారితో అంటకాగిన ట్రేడ్ యూనియన్ నాయకుడుగాని దీనిపై ఇప్పటివరకు నోరు తెరవలేదు. ఖండించనూలేదు!! తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారు..
 
అందుకే తాను కార్మిక నాయకులను నిందించడం జరిగింది. అందరూ దొంగలు కాదు కానీ.. ప్లాంటును ప్రైవేటు పరం చెయ్యడానికి ప్రయత్నించి నప్పుడుగాని, ప్లాంటును మూసి వేసేందుకు ప్రయత్నించినప్పుడుగాని వారిని ఎందుకు నిలదీయలేదు అన్నది నా ఆవేదన అని పేర్కొన్నారు. 

 

రెండు నెలల క్రితం రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్క రాజధాని కడదామనుకున్న @ysjagan గారి వికృత ఆలోచనను టీవీ డిబేట్ లో బహిరంగంగా పరిచారు..

అటు వైసీపీ నాయకులు గాని, వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకులు గాని ముఖ్యంగా వైసిపి కండువా కప్పుకొని… pic.twitter.com/tcDsayS9tD

— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు