వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

ఐవీఆర్

బుధవారం, 4 జూన్ 2025 (19:17 IST)
వైసిపి వెన్నుపోటు దినం నిరసన ఈ రోహిణి కార్తె వేడి ఎండల్లో చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆయన వాహనం పైనుంచి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మైకం వచ్చి జారిపోతూ కింద పడిపోయారు. దీనితో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు.
 
ఆ తర్వాత ప్రధమ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ వెల్లడించారు. ఏపీలో వెన్నుపోటు దినం విజయంతం అయ్యిందని బొత్స అన్నారు.

ఏంటి పళ్లు పటపట కొరుకుతున్నావ్? అంబటి రాంబాబుకి పోలీస్ అధికారి వార్నింగ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తామంటూ అందుకోసం నాయకులు రోడ్డెక్కి నిరసన చేసేందుకు కదిలారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రోడ్డుపైకి వచ్చి నిరశన తెలియజేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, అంబటి రాంబాబుకి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
 
పోలీసు అధికారి వంక చూస్తూ అంబటి రాంబాబు గట్టిగా పళ్లు కొరుకుతూ వుండటంతో చిర్రెత్తిపోయినా పోలీసు అధికారి.. ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, పోలీసుల డ్యూటీకి అడ్డు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు