ఏపీ మద్యం కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ జరుపుతాం.. చంద్రబాబు

సెల్వి

బుధవారం, 24 జులై 2024 (19:08 IST)
ఏపీ మద్యం కుంభకోణంపై సీబీసీఐడీ ద్వారా విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల రికార్డులను సీఐడీ విచారిస్తుందని చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఈ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా రంగంలోకి దించే అవకాశం ఉందని వెల్లడించారు. 
 
డిజిటల్ చెల్లింపులకు భిన్నంగా మద్యం దుకాణాల్లో నగదు మాత్రమే వినియోగించే విధానం ఈ తీవ్ర ఆర్థిక అవకతవకలకు మూలకారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ విధించిన ఈ మద్యం పాలసీ ద్వారా వేల కోట్ల నగదు చేతులు మారిందని అనుమానం వ్యక్తం చేశారు.
 
మద్యం పాలసీ ద్వారా కనీసం 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు. గత ఐదేళ్లలో ఏపీలో రూ.5 లక్షల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయని, అందులో రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని గుర్తించారు. మిగిలిన మొత్తాన్ని నగదు చెల్లింపుల ద్వారా బదిలీ చేయడంతో పలువురు వైసీపీ నేతలు లబ్ధి పొందినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు