చంద్రబాబు హైదరాబాద్ విజన్ కంప్లీట్, ఇక అమరావతిపైన టార్గెట్: నాగబాబు

ఐవీఆర్

శనివారం, 19 అక్టోబరు 2024 (18:17 IST)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ విజన్ వున్నటువంటి సీఎం అనీ, హైదరాబాదు విషయంలో ఆయన అనుకున్నది కంప్లీట్ చేసారని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ''చంద్రబాబు నాయుడిని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారికి నష్టం చేసి అయ్యాడని అంటారు కానీ పూర్వాపరాలు ఏంటని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు.
 
కానీ హైదరాబాద్ నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలన్న విజన్ తో వున్న సీఎం చంద్రబాబు. దాన్ని సాకారం చేసారాయన. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు గారికి ఓ విజన్ వుంది. కానీ మధ్యలో వైసిపి వచ్చి దాన్ని సర్వనాశనం చేసింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక అమరావతి రాజధాని సాకారం జరిగి తీరుతుంది.
 
చంద్రబాబు నాయుడుకి వున్న ఓర్పు, సహనం ఎంతో వుంది. ఎవరెన్ని మాటలు అన్నప్పటికీ ఓర్పుతో ముందుకు సాగుతారు. ఇప్పుడు చంద్రబాబు-పవన్ కల్యాణ్ గారు ఏదైతే ప్రామిస్ చేసారో అవి వచ్చి తీరుతాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నీతిజ్ఞుడు. రాష్ట్ర సమస్యల పట్ల చంద్రబాబు నాయుడు గారికి వున్న అవగాహన మరెవ్వరికీ లేదు'' అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు