జనసేన కార్యాలయానికి చంద్రబాబు: సత్కరించిన పవన్ దంపతులు

ఐవీఆర్

మంగళవారం, 4 జూన్ 2024 (20:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి చంద్రబాబును సత్కరించారు. పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కరిస్తూ ఆశీస్సులు తీసుకున్నారు.

కేంద్రంలో కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 47 వేలకుపైగా ఓట్లతో చంద్రబాబు విజయం సాధించారు. ఈ క్రమంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.
 
మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. 

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం అభినందించుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు.#KutamiTsunami #BabuIsBack #BossIsBackpic.twitter.com/oNpyw0VZN8

— Telugu Desam Party (@JaiTDP) June 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు