తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కిలోన్నర బంగారంతో కాళేశ్వరం సన్నిధిలోని శుభానందా దేవికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని 2012లో మొక్కిన కేసీఆర్, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కాళేశ్వర క్షేత్రానికి సోమవారం వచ్చి ఆ మొక్కును చెల్లించుకున్నారు. కేసీఆర్ దంపతులు రూ.60 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి సమర్పించారు. ఈ కిరీటాన్ని హైదరాబాద్ అబిడ్స్లోని త్రిభువన్ జ్యువెలరీస్ తయారు చేసింది.
ఆ తర్వాత కన్నెపల్లి వద్ద కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్కు కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.