కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా

గురువారం, 25 నవంబరు 2021 (17:58 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కైకాల టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కైకాల చిన్న కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని సీఎం జగన్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స జరుగుతోంది. కైకాల ఆరోగ్యం మెరుగవుతున్నట్లు బుధవారం కైకాల కుమార్తె తెలిపారు. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న కైకాల ర‌క్త‌పోటు త‌గ్గింది. కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌డిందని అపోలో వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.
 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాలను పరామర్శించిన విషయం తెలిసిందే. అలాగే చిన్న బాబుతో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఫోన్లో కైకాల ఆరోగ్యం గురించి మాట్లాడి ధైర్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు