ఏపీలో కోటి మందికి పైగా కొవిడ్ టీకాలు

బుధవారం, 2 జూన్ 2021 (12:25 IST)
కొవిడ్ వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,74,471 మందికి  మొదటి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 98,85, 650 డోసులు అందాయన్నారు. ఇందులో కేంద్రం నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 66,82,570 డోసులు, కోవాగ్జిన్ 15,17,450 డోసులు అందగా, రాష్ట్ర ప్రభుత్వం 13,41,700 కోవిషీల్డ్ డోసులు, 3,43,930  కోవాగ్జిన్  డోసులు కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 82,95,973 మందికి, కోవాగ్జిన్ 17,78,218 మందికి వేయించామని ఆయన వివరించారు. ఇందులో మొదటి డోసు టీకా వేసుకున్నవారు 75,45,304 మంది, రెండు డోసులూ వేసుకున్నవారు 25,29,167 మంది ఉన్నారని కాటంనేని పేర్కొన్నారు.

మొత్తం 98,85, 650 డోసులను హెల్త్ కేర్ వర్కర్లు ఎక్కడా వృధాకాకుండా టీకా వేయడంవల్ల అదనంగా సుమారు 2లక్షల మందికి టీకా అందించగలిగామని.. దీంతో రాష్ట్రంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 1,00,74,471 మందికి చేరిందని  తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు