మండపం పల్లిలో నాగాలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:08 IST)
తిరుపతి, చంద్రగిరి మండలం మండపం పల్లిలో నాగలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరాధిస్తున్న నాగాలమ్మ దేవత ప్రజలకు అండగా నిలిచి పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అభ్యర్థి అచ్యుత విజయకుమార్ రెడ్డిలను మోహిత్ రెడ్డి అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు