దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

ఐవీఆర్

మంగళవారం, 19 ఆగస్టు 2025 (22:36 IST)
నెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై వీడియోలో కనిపించిన బాధిత మహిళ తనుక ఒక ఖైదీకి కేర్ టేకర్‌గా ఉన్నాననీ, అతడి ఆరోగ్యం కోసం ఆ ఖైదీని ఆలింగనం చేసుకుంటే తప్పేంటి? అంటూ ఓ ప్రైవేట్ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రశ్నించారు.
 
ఆసుపత్రిలో అతనితో క్రీమ్ రాయించుకుని మసాజ్ చేయించుకుంటే తప్పేంటి? ఇలాంటివి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లాంటోళ్ళు పబ్లిక్‌గా చేస్తే తప్పు లేదు గానీ, నేను చేస్తే తప్పెలా అవుతుంది? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
ఏం జరిగింది?
నెల్లూరు జిల్లాలో ఓ హత్య కేసులో శ్రీకాంత్ అనే రౌడీ షీటర్‌కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఈ ఖైదీ తనకు అనారోగ్యంగా వున్నదని పెరోల్ మీద ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అక్కడ అతడికి పరీక్షలు చేసారు వైద్యులు.
 
అనంతరం అతడు మరికొన్ని పరీక్షల కోసం ఆసుపత్రి గదిని కేటాయించారు. ఆ గదిలో సదరు ఖైదీ ఓ మహిళకు మసాజ్ చేస్తూ కనిపించాడు. ఏకంగా ఆసుపత్రి బెడ్ పైనే ఇవన్నీ చేసాడు. మహిళకు నూనె రాస్తూ వీడియోలో కనిపించాడు. ఈ వ్యవహారం కాస్తా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు