Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

సెల్వి

సోమవారం, 16 జూన్ 2025 (10:33 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నెల తిరగకముందే ప్రాణాలు వదిలేశారు. ఈ ప్రమాదంలో నెల క్రితం మ్యారేజ్ అయిన కొత్త జంట సాయినాగేంద్ర, శాలిని ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ చిరుద్యోగులు. హాస్పిటల్‌లో పనిచేస్తూ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. 
 
కానీ ఇంతలోనే మృతి చెందారు. వీరద్దరూ ఆస్పత్రిలో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమను మరికాస్త ముందుకు తీసుకెళ్లి పెళ్లిగా మలిచి నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు గన్నారు.   
 
కుటుంబ సభ్యుల అంగీకారంతో మే 11న కాకినాడలోని కొమరగిరిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారం క్రితమే మళ్లీ గాజువాక వచ్చి కాపురం పెట్టారు. ఇలా ఇద్దరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ సరదా సరదాగా జీవించారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం ఆర్కే బీచ్‌కు వెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. 
 
దీంతో బైక్‌పై వెళ్తుండగా.. షీలానగర్‌-కాన్వెంటు మార్గంలో నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయినాగేంద్ర స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. శాలిని తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు