ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

ఠాగూర్

శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 
కాగా, సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ, పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ కార్యాలయాలు ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!! 
 
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ టీవీ, సినిమాల్లో నటించనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సినీ, సీరియల్ నటిగా కొనసాగిన విషయం తెల్సిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తన నటనకు దూరంగా ఉంటున్నారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఆమె తిరిగి సినిమాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఒక సిరీస్ కోసం ముఖానికి మేకప్ వేసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. 
 
గతంలో పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రలను పోషించిన స్మృతి ఇరానీ.. "అమర్ ఉపాధ్యాయ్‌" అనే సిరీస్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు, ఈ విషయమై ఇప్పటికే వారిని సంప్రదించినట్టు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ఏక్తా కపూర్ కోరిక మేరకు మరోమారు కెమెరా ముందు నటించేందుకు స్మృతి అంగీకారం తెలిపారని, తులసి పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై ఏక్తా కపూర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేద. అలాగే, కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కూడా స్పందించకపోవడం గమనార్హం. 


ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం

రెండో బ్లాక్ లో ఎగిసిపడ్డ మంటలు

రెండో బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్, పయ్యావుల, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఆనం, నారాయణ పేషీలు

బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం

మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది… pic.twitter.com/NP05TeGEU2

— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు