కాగా, ఈ నెల 3వ తేదీన గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి కమలమ్మను తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేసి జీబీఎస్ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించి, అందుకు తగిన విధంగా చికిత్స అందించారు. దీంతో జ్వరం తగ్గినట్టు కనిపించడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆమెకు రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.