మాటలు తూటాలు పేల్చడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కొందరు నేతలు గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అలాంటి వారిలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఒకరు. ఐతే తెదేపా కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాపు కేసుల్లో అరెస్టయిన వల్లభనేని వంశీ మంగళవారం నాడు గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. నడకలోనూ కాస్తంత తేడా కనిపిస్తుండగా తీవ్రంగా దగ్గుతూ, రొప్పుతూ కనిపించారు. అసలాయన వల్లభనేని వంశీయేనా అనే అనుమానం సైతం కలుగుతుంది. వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. ఆ సమయంలో ఆయన పోలీసు వాహనం ఎక్కేందుకు వస్తూ కనిపించారు. తీవ్రంగా దగ్గుతూ కనిపించారు.