విందు భోజనం ఆరగించి మాయమైన వరుడు....

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:01 IST)
పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయు. పెళ్లికి వచ్చిన వారందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. వారితోపాటు పెళ్లికొడుకు కూడా భోజనం చేశాడు. కొంత సమయానికి మండపంలో కలకలం రేగింది. వరుడు కనిపించడం లేదు. పెళ్లి కూతురు తరఫున వారికి గుబులు మొదలైంది. పారిపోయాడని అందరూ అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే విశాఖలోని కోరమాండల్ సమీపాన ఉన్న ఐఎంజీ కాలనీకి చెందిన కృష్ణ తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి (ఫిబ్రవరి 20) పెళ్లి ఉండగా, విశాఖలోని శ్రీహరిపురం వద్ద ఉన్న యారాడపార్కు వద్ద గ్రౌండ్‌లో పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
మధ్యాహ్న భోజన సమయంలో పెళ్లికొడుకు అందరితో భోజనం చేశాడు. కొంత సమయానికి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వరుడు మరో అమ్మాయిని ఇష్టపడ్డాడని, ఈ పెళ్లి ఇష్టం లేకే ఆలా చేశాడని గుర్తించారు. కానీ వరుడు కొద్ది సేపటికి తిరిగి వచ్చేశాడు. కానీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు