ప్రేమించిన యువతి దక్కలేదనీ యువకుడు ఏం చేశాడో తెలుసా?

మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:13 IST)
ప్రేమించిన యువతి దక్కక పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వివాహానికి విముఖత తెలపడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ దామోదర్ అందించిన వివరాల ప్రకారం, ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్న మల్లేష్‌ అనే ప్రభుత్వ ఉద్యోగికి సాయికిరణ్‌ (27) అనే కుమారుడు ఉన్నాడు. 
 
పాల వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న సాయి కిరణ్ గత కొద్ది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఆ యువతితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కానీ ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికిరణ్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తర్వాత ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు