'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

ఠాగూర్

శనివారం, 21 జూన్ 2025 (10:31 IST)
ప్రతి యేటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ యోగా దినోత్సవం "మానవాళి కోసం యోగా 2.0"కు నాంది పలకాలని, దీనిద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. 
 
యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ఆయన ఆకాక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని అదొక జీవన విధానమన్నారు. యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం ఇది ప్రపంచాన్ని కలిపింది అని ఆయన తెలిపారు.
 
విశాఖలోని ఆర్కే బీచ్‌లో మూడు లక్షల మందికిపై ప్రజలతో కలిసి ప్రధాని మోడీ కామన్ యోగా ప్రోటోకాల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 
 
"దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది. మానవాళి శ్వాస తీసుకోవడానికి సమతుల్యం చేసుకోవాడానికి తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరైన విరామ బటన్‌ యోగా" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

Happy 11th international yoga day ❤️#YogaDay2025 #NarendraModi pic.twitter.com/ys8N4yKn6t

— Sachin ( Modi Ka Parivar ) (@SM_8009) June 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు