పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జైసేన కర్ణాటకకు విస్త‌ర‌ణ‌!

గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:11 IST)
జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన "జైసేన" చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు. ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు. శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన "జై సేన" చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు  అందరినీ అమితంగా ఆకట్టుకుంది. 
 
ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన "జై సేన" కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.సముద్ర!!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు