పెళ్లి ముహూర్త సమయాని కంటే లేటుగా వచ్చాడని, పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా బసంత్ నగర్కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకుగాను పాలకుర్తికి చెందిన స్థానిక కోదండ రామాలయ పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు.