కత్తి మహేష్ ఏం చేస్తున్నాడో తెలుసా..

ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:39 IST)
పవన్ కళ్యాణ్‌ పైన, ఆయన అభిమానులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు  బహిష్కరించిన నేపథ్యంలో టీవీ చర్చలకు, సామాజిక మాధ్యమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పడు కత్తి తన ఫోకస్‌ను రాజకీయాలపై పెట్టాడు. ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాల్లో పర్యటించి దళిత సంఘాలతో సమావేశాలు అవుతున్నాడు. 
 
దళితుల్లో నూతన నాయకత్వాన్ని వెతికే పనిలో పడ్డాడు. దళితులకు రాజ్యాధికారం సాధించాలని, రానున్న ఎన్నికల్లో దళితులదే వాయిస్ వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశముందని పేర్కొన్నారు. 
 
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య  పరువు హత్య కాదని కుల దురహంకార హత్యగా పేర్కొన్నాడు. మరి సినిమాల్లో పెద్దగా రాణించని కత్తి టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా బాగానే ప్రాచూర్యం పొందాడు. కత్తి మహేష్ ఏ రాజకీయ పార్టీలో చేరతాడో.. రాజకీయాల్లో ఎలా రాణిస్తాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు