పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా, తన తమ్ముడి ప్రసంగాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. "జనసేన జయకేతనం" కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తనను మంత్రముగ్ధుడిని చేసిందని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ఉన్న అఖండ జనసమూహం లాగే, తన హృదయం కూడా భావోద్వేగంతో నిండిపోయిందని చిరంజీవి పేర్కొన్నారు.