Chiranjevi Sanmanam poster
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదల గారికి కి హౌస్ ఆఫ్ కామన్స్ - యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.