కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాక్షికంగా మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిని ఐదుగురు మృగాళ్లు చెరబెట్టి.. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల దుశ్చర్యతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
18 ఏళ్ల యువతిని ఐదుగురు మృగాళ్లు నాలుగు నెలల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలికి తల్లిదండ్రులు లేకపోవడంతో తోడుగా ఉండాల్సిన సోదరుడు జీవనోపాధి కోసం నకిరేకల్కు వలస వెళ్లాడు. ఒంటరిగా మిగిలిన ఆ యువతి ఇంటి వద్దే ఉంటూ స్థానికంగా ఉన్న మేనత్త వద్ద రక్షణ పొందుతోంది. ఒంటరిగా ఉంటున్న యువతిపై ఒకరితరువాత ఒకరు నాలుగు నెలలుగా గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.