ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు.
ఎన్నికల రోజు కార్యకలాపాలను రియల్ టైమ్లో పర్యవేక్షించడానికి, లోకేశ్ కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ అభ్యర్థులకు అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అన్ని కూటమి నాయకులు సమిష్టిగా పనిచేయాలని నారాలోకేష్ కోరారు.