గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో డొంకలు కదులుతున్నాయి. నయీమ్కు నల్లగొండతోపాటు ఇతర జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే అయినా.. అందుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అవి ఇన్నాళ్లూ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు తాజాగా దొరికిన ఆధారాలు ప్రకంపనలను సష్టించేలా ఉన్నాయి.
మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అతని ఆచూకీ తెలియలేదు. మృతుడి ఒంటిపై ఎర్రరంగు డ్రాయర్, నైట్ ప్యాంటు మాత్రమే ఉన్నాయి. హతుడికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.