సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబికి ఇప్పటివరకు ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో రాష్ట్రంలోని అనేక మది ప్రయాణికులు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై వీరి కష్టాలు తీరిపోనున్నాయి.