తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు

మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:07 IST)
ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో తిరుమలలో చంటిబిడ్డను కర్కశంగా గొంతు నులిమి చంపేశారు ఎవరో కర్కశ తల్లిదండ్రులు. బాలాజీ బస్టాండ్ సమీపంలోని మరుగుదొడ్ల వద్ద స్థానికులు చిన్నారి మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు ఆ మృత శిశువు ఆడబిడ్డగా గుర్తించారు. ఆడపిల్ల పుట్టడంతోనే చంపి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సి.సి.ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. తిరుమలలో చిన్నారి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు