ప్రాయశ్చిత్త దీక్ష.. అలిపిరి నుంచి పవన్ పాదయాత్ర.. 2 రోజులు కొండపైనే (video)

సెల్వి

మంగళవారం, 1 అక్టోబరు 2024 (18:30 IST)
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల నుండి కాలినడకన తిరుమలకు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మద్దతుదారులు, కార్యకర్తలు, పోలీసు సిబ్బందితో కలిసి, కళ్యాణ్ కొండెక్కడం ప్రారంభించారు. ఈ యాత్ర తిరుమల ఆధ్యాత్మిక-సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే రీతిలో వుంటుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలి నడకన బయలుదేరారు.#PawanKalyan pic.twitter.com/krEByqkOzt

— ㄒ卄乇ㄚ 匚卂ㄥㄥ 卄丨爪 OG (@imPSPKfan) October 1, 2024
బుధవారం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆయన తిరుపతిలోనే పర్యటించనున్నట్లు తెలుస్తుంది. 
 
ఇక అలిపిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూనే.. కొండపైకి నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల వెళ్తున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.#ధర్మో_రక్షతి_రక్షితః#OmNamoNarayanaya #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/goxDovJZfE

— JanaSena Shatagni (@JSPShatagniTeam) October 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు