పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ముద్రగడ నివాసానికి వర్మ స్వయంగా వెళ్లారు. ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ఇకపోతే.. ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఒక వాదన వినిపిస్తోంది. అయితే, ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వర్మ వైసీపీలో చేరేందుకే పద్మనాభంతో భేటీ అయ్యారని టాక్ వస్తోంది.