454వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

సోమవారం, 15 మార్చి 2021 (11:02 IST)
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 454వ రోజుకి చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు