రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62కి పెంపు

సోమవారం, 31 జనవరి 2022 (22:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పీఆర్సీపై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పాత పీఆర్సీని అమలు చేయాలని ఏపీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఫైలుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదముద్ర కావడంతో… దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై రిటైర్ కాబోయే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు