జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్... ఆర్.ఆర్.ఆర్. కోర్టు ధిక్కరణ పిటిషన్

గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:02 IST)
జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్ చేసింద‌ని, దీనిపై రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని నేడు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. 
 
జగన్ బెయిల్ పై తీర్పు న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉండగా, త‌న బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా ప్రచారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

దీనితో సాక్షి మీడియా ప్ర‌తినిధులు మురళి వినయ్ మహేశ్వరులు నేడు విచారణకు హాజర‌య్యారు. సాక్షి మీడియా కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు