తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:18 IST)
తిరుపతి నుండి హైదరాబాదు వెళ్ళావలసి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానంలో  ఎసి పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ విమానాన్ని 3 గంటల పాటు నిలిపివేశారు. అంతసేపూ ఎయిర్‌పోర్టు లోనే ప్రయాణీకులు వేచియున్నారు.
 
తీరా ఎసి పని చేస్తుందని బయలుదేరిన సమయంలో మళ్లీ ఏసీ పనిచేయలేదు. ఎసి లేకుండానే హైదరాబాదుకు టేక్ ఆఫ్ అయింది స్పైస్ జెట్ విమానం. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. 
 
ఏసీ లేకుండా విమానంలో ప్రయాణం చేయడ చాలా ఇబ్బందికరమని వాపోయారు. జరిగిన పొరబాటుపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది స్పైస్ జెట్. ఈ ఘటనపై దర్యాపుకు ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు