ఏపీ అసెంబ్లీ సమావేశాలు - తెదేపా సభ్యుల సస్పెన్షన్

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మూడో రోజైన సోమవారం రోజున సభలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి ప్రధాన కారణం గత తెలుగుదేశం పార్టీయేనని వైకాపా నేతలు ఆరోపించారు. దీన్ని టీడీపీ సభ్యులు తిప్పికొట్టారు. దీంతో సభలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. దీంతో మార్చల్స్ వచ్చి తెదేపా సభ్యులను బయటకు తీసుకెళ్ళారు. 
 
పోలవరం ప్రాజెక్టుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో రాష్ట్ర జలవనరులు శాఖామంత్రి అంబటి రాంబాబు ప్రసంగించారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, తెదేపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం జాప్యానికి కారణం టీడీపీయేనని ఆయన ఆరోపించారు. 
 
ఈ చర్చ సందర్భంగా తమ పార్టీపై అకారణంగా విమర్శలు గుప్పిస్తున్నారంటూ తెదేపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే, సీఎ జగన్ ప్రసంగానికి అడ్డు తగిలారు. వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సభ్యులను స్పకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు