ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడిభాగాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇవి మార్గమధ్యంలో చోరీకి గురయ్యాయా లేక కంపెనీలోనే దొంగతనం చేశారా అనే అంశంపై స్పష్టత రావాల్సివుంది.
ఈ చోరీకి సంబంధించిన గత నెల 19వ తేదీన కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా, పోలీసులు అందకు సమ్మతించలేదు. లిఖితపూర్వకంగా ఇస్తేనే విచారణ చేపడుతామని స్పష్టం చేయడంతో ఇక చేసేది లేక వారు ఫిర్యాదు చేశారు.
దీంతో కియా కార్ల తయారీ కంపెనీలో చోరీకి గురైన ఇంజన్లు ఎక్కడున్నాయన్న అంశాన్న నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా పూర్తికాగా, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.