బాధితులకు సౌకర్యాల కల్పనపై ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్ ఎంపీడీవో సుశీలాదేవి, తిరుపతి రూరల్ తహసిల్దార్ భాగ్యలక్ష్మి తో కలిసి వచ్చి పరిశీలించారు. మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, మీకు నేను అండగా ఉంటానని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
బాధితులకు భోజన సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి కి సూచించారు. వర్షపు నీటిని తొలగించేందుకు యుద్ద ప్రాతపదికన చర్యలు చేపట్టాలన్నారు.
తాగునీరు కలుషితమయ్యాయని వివరించారు. అత్యవసర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తిరుచానూరు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం..
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.